కోరేషు యొక్క ప్రేరణ మరియు మన భవిష్యత్తు
పారసీక రాజు కోరెషు వలె: మానవాళి భవిష్యత్తు అప్పటికే పరిశుద్ధగ్రంథంలో నమోదు చేయబడెను
పారసీక రాజైన కోరెషు, పరిశుద్ధగ్రంథంలో తన గురించిన ప్రవచనాన్ని కనుగొని, ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించేలా కదిలిపోయి, యెరూషలేములో మందిరాన్ని నిర్మించినట్లుగానే, మనం కూడా పరిశుద్ధగ్రంథంలో నమోదు చేయబడిన ప్రవచనాలను నమ్మవలెను. కోరేషు వలె అదే గాఢమైన ఆనందంతో నింపబడి, దేవుడు మనకు ఆజ్ఞాపించిన సువార్తను మన పూర్ణ హృదయంతో మరియు పూర్ణాత్మతో ప్రకటించవలెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారికి మరియు తల్లయైన దేవునికి భయభక్తులు గల సీయోనులోని పరలోక సంబంధులైన పిల్లలకు వాగ్దానము
పది మినాల ఉపమానం ద్వారా యేసు బోధించినట్లుగా, దేవుని వాక్యమునకు భయభక్తులు గలవారికి ఆయన మహిమగల భవిష్యత్తును వాగ్దానం చేశారు. ఆ భవిష్యత్తులో, మరణము, దుఃఖము, ఏడ్పు, వేదన లేని పరలోక రాజ్యంలో వారు దేవునితో కలిసి యుగయుగాలు పాలించుచూ నిత్య మహిమను అనుభవిస్తారు.
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
. . .ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
ప్రకటన 21:1–4
వీక్షణల సంఖ్య302
#ప్రవచనం
#ఆశ
#విశ్వాసం