“క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” అని వ్రాయబడినట్లు, మరియు యేసు “ఎవరైనా నా శిష్యుడు కావాలంటే తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి” అని చెప్పినట్లు, పరలోక రాజ్యపు మహిమ కోసం జీవించే వారందరి జీవితాల్లో క్షణికమైన శ్రమ తప్పకుండా వస్తుంది.
ఏశావు మరియు యూదా ఇస్కరియోతు పాపము యొక్క సుఖాలను వెంబడిస్తూ శరీరానుసారంగా జీవించారు, మరియు అంతిమంగా పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను కోల్పోయారు. ఏమైనా, మోషే, యాకోబు, దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు పరలోకము యొక్క సుఖాలను అధికముగా విలువైనదిగా పరిగణించడం ద్వారా కష్టాలను అధిగమించారు. అదేవిధంగా, దేవుని సంఘము యొక్క సభ్యులు ఆయన ఆజ్ఞాపించినట్లుగానే, క్రొత్త నిబంధన విశ్రాంతి దినము మరియు పస్కా యొక్క ఆశీర్వాదాలను ప్రకటించుటకు తమను తాము అంకితం చేసుకుంటూ, దేవుని చేత వాగ్దానం చేయబడిన పరలోకము యొక్క సుఖాలపై తమ నిరీక్షణను ఉంచుతారు.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీయులు 11:24–26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం